వాణీజయరాంకు కడసారి కన్నీటి వీడ్కోలు

by Disha Web Desk 7 |
వాణీజయరాంకు కడసారి కన్నీటి వీడ్కోలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ దక్షిణాది సింగర్ వాణీజయరాం అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో వాణిజయరాంకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. బేసంట్ ​నగర్​ శ్మశాన వాటికలో వాణిజయరాం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకముందు వాణీజయరాం నివాసానికి చేరుకుని తమిళనాడు సీఎం ఎం​కే స్టాలిన్ నివాళులు అర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ 'వాణీజయరాంకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డు ప్రకటించింది. దురదృష్టవశాత్తు ఆ అవార్డు తీసుకోకుండానే ఆమె​ తుదిశ్వాస విడిచారు. వాణీజయరాం కుటుంబ సభ్యులకు, సినీ లోకానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'అని స్టాలిన్​ చెప్పారు. కాగా, శనివారం చెన్నైలోని తన నివాసంలో వాణీజయరాం తుదిశ్వాస విడిచారు. వాణీజయరాం మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.

READ MORE

'# అశోక్ గల్లా2'.. ఘనంగా ప్రారంభమైన సినిమా షూటింగ్!


Next Story